తెలంగాణ
నల్లగొండ, భువనగిరిలో మనం పోటీ చేద్దాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 March 2019
హైదరాబాద్, మార్చి 18: లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ నేతలు కోరారు. ఈమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో సమావేశమయ్యారు. నల్లగొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎండీ యూసఫ్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఇన్చార్జి కడారి అంజయ్య యాదవ్, భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జక్కలి ఐలయ్య యాదవ్తో పాటు పలువురు నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దించితే కచ్చితంగా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ రెండు లోక్సభ స్థానాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉందని వారన్నారు.