తెలంగాణ
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీల నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 18: టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జీలను నియమించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జీగా సీఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్కను నియమించారు. అదేవిధంగా ఆదిలాబాద్కు మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని నియమించారు. మహబూబాబాద్కు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పెద్దపల్లికి ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు, కరీంనగర్కు టీ జీవన్ రెడ్డి, వరంగల్కు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. జహీరాబాద్కు మాజీ మంత్రి షబ్బీర్అలీ, నిజామాబాద్కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్కు షేక్ అబ్దుల్లా సోహెల్, సికింద్రాబాద్కు మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి, మెదక్కు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మల్కాజిగిరికి కే శ్రీశైలం గౌడ్, చేవెళ్ళకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ను ఇన్చార్జిగా నియమించారు. అలగే మహబూబ్నగర్కు ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్కు మాజీ మంత్రి డీకే అరుణ, నల్లగొండకు మాజీ మంత్రి కే జానారెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు.