తెలంగాణ

బాత్‌రూంలో జారిపడి తల్లి.. గుండెపోటుతో కుమారుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, మార్చి 19: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని రాంనగర్‌కు చెందిన చెరుపల్లి లలిత (72) మంగళవారం స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ బాత్‌రూంలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి మృతి చెందిన వార్త కుటుంబ సభ్యులతో సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు చెరుపల్లి సురేందర్ (53) ఫొటోగ్రాఫర్ వనస్థలిపురం నుండి కుటుంబ సభ్యులతో వెంటనే పోచంపల్లికి వచ్చాడు. తల్లి మృతదేహాన్ని చేసి కుమారుడు బోరున విలపిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుతో బాధపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సురేందర్ మృతి చెందాడు తల్లి, కుమారుడు మృతి చెందారనే వార్తతో పెను విషాదం చోటు చేసుకుంది. చెరపల్లి లలితకు భర్త, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. చెరుపల్లి సురేందర్ వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. తల్లి, కుమారుడు చనిపోయారని సమాచారం అందుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ సార సరస్వతి, జడ్పీటీసీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, టీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండు మధు, తదితరులు మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.