తెలంగాణ
బీజేపీ హయాంలో పెరిగిన అసద్ ఆస్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 March 2019
హైదరాబాద్, మార్చి 19: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆస్తులు ఎలా పెరిగాయని కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ సమీర్ ఉల్లా ప్రశ్నించారు. ఆస్తులు ఎలా సంపాదించారో ఒవైసీ ప్రకటించాలని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అసద్కు గానీ, సతీమణికి గానీ వ్యాపారాలు లేనప్పుడు ఆస్తులు ఎలా కూడగట్టారని ఆయన ప్రశ్నించారు. 2014లో ఓవైసీ ఆస్తులు 4 కోట్ల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారని, ఇప్పుడు 13 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారని ఆయన వివరించారు.