తెలంగాణ

3 స్థానాల్లో టీజేఎస్ పోటీ: కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తామని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అబ్బాస్, మహబూబాబాద్ నుంచి అరుణ్ కుమార్ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీ ఎక్కువ ఉన్నందున ఇంకా ఖరారు చేయలేదన్నారు. తెలంగాణ, ఆంధ్ర అంటూ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచవద్దని ఆయన కోరారు. నిజామాబాద్‌లో నామినేషన్లు వేసిన రైతులపై కేసులు పెట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల వెంట తాము ఉంటామని, రాజకీయ ప్రక్రియలో మార్పు కోసం తాము పని చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయారాం-గయారాంలు ఎక్కువ అయ్యారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై ప్రజలు తిరుగుబాటు చేస్తేనే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా రాజకీయాలు ఉండాలని ఆయన అన్నారు. ఇలాఉండగా ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఇలాఉండగా సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి సోమవారం ఉదయం ప్రొఫెసర్ కోదండరామ్ నివాసానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు.