తెలంగాణ

మోదీతోనే దేశంలో సుస్థిరపాలన: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిరపాలన అందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్ధి జీ కిషన్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారని చెప్పారు. టీఆర్‌ఎస్ తెలంగాణలో ఒక్క సీటు గెలిచినా ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. బీజేపీ గెలిస్తే దేశంలో సుస్థిరపాలన వస్తుందని, అవినీతి కుటుంబ పాలనకు చెక్ పెట్టాలంటే నరేంద్రమోదీని సమర్ధించాలని, బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. బీజేపీ నుండి మంచి అభ్యర్ధులను రంగంలోకి దించామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గెలవాలని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా బీజేపీ అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, తెలంగాణలో అభివృద్ధి కోరుకునే వారు నరేంద్రమోదీకే ఓటు వేయాలని చెప్పారు. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్ధి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇక ప్రచారమే తరువాయి అని అన్నారు. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉందని, ప్రచారం ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కేసీఆర్ 16 సీట్లు గెలిచినా ప్రధాని కాలేరని, సికింద్రాబాద్‌లో తనకు అవకాశం ఇస్తే రూపురేఖలను మారుస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి సమర్ధులకు ఓటు వేయాలని అన్నారు.