క్రైమ్/లీగల్

చిచ్చురేపిన పోస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉద్రిక్తతలను రేపుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖరరెడ్డిని కించపరిచే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు గొడవకు కారణమయ్యాయి. తమ అభ్యర్ధిని కించపరిచేలా ఉందంటూ టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి రాజశేఖరరెడ్డికి చెందిన విద్యాసంస్థల వార్షికోత్సవంలో విద్యార్థులు చేసిన నృత్యాలను అసభ్యకరంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనుచరులపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్టులతో ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు, కంటోనె్మంట్ ఇన్‌చార్జి క్రిషాంక్, కంటోనె్మంట్ సభ్యురాలు భాగ్యశ్రీ, శాంకుమార్ తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్రం.. మల్కాజిగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు