తెలంగాణ
ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 April 2019
హైదరాబాద్, ఏప్రిల్ 19: సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు మంగళంపల్లి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వీవర్స్ డవలప్మెంట్ ఫోరమ్ వ్యవస్థాపకుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రమేష్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేత కార్మికుల సంక్షేమానికి, ఆత్మహత్యలను ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినా స్పందించక పోవడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.