తెలంగాణ

యాదాద్రిలో ముగిసిన ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 17: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు కొనసాగిన స్వామివారి జయంత్యుత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకాలతో ముగిశాయి. మూడవ రోజు ఉదయం నిత్య హవనం, మూల మంత్ర పారాయణాల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పాంచరాత్రగమశాస్త్రానుసారం యాజ్ఞిక, అర్చక బృందం స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం మహా మండపంలో తిరువారాధన సేవాకాలం, శ్రీ నృసింహ ఆవిర్భావ ప్రవచనం, జయంతి ఉత్సవం, నివేదన, తీర్ధప్రసాద వినియోగం, పండిత సన్మానం ఉత్సవ పరిసమాప్తి నిర్వహించారు. మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేక పూజల్లో ఈవో గీత, అనువంశీక ధర్మకర్త బి.నరసింహమూర్తి, సినీ నటుడు వేణుమాధవ్ దంపతులు పాల్గొన్నారు. అటు పాతగుట్టలోనూ నృసింహ జయంతి ఉత్సవాల ముగింపు శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. జయంత్యుత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఘనంగా ముగిశాయి.
చిత్రం... కలశాల ఊరేగింపులో ఈవో గీత, అర్చకులు