తెలంగాణ
జూ. కాలేజీల్లో ఫీజులు నియంత్రించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 May 2019
హైదరాబాద్, మే 17: పదో తరగతి పరీక్షల్లో అనూహ్య ఫలితాలు రావడంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెలగాటంగా మారిందని, విద్యార్థులను, తల్లిదండ్రులను సీట్లు పేరిట ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య సగటున 75 వేలు మాత్రమేనని, ఈసారి అంతే చేరవచ్చని, మరికొంత మందికి రెసిడెన్షియల్ కాలేజీల్లో అవకాశం వస్తుందని, అయినా దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలను ఆశ్రయించాల్సి వస్తోందని వారు వివరించారు.