తెలంగాణ

16 ఏళ్లకే ఎంఎ పరీక్ష రాసిన నైనా జైస్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 16 ఏళ్ల వయసులో ఎంఎ (పొలిటికల్ సైన్స్) పరీక్ష రాశారు. ఎంఎ చివరి పరీక్షను జాంబాగ్‌లోని వివేక వర్ధిని డిగ్రీ కాలేజీలో రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షలో 16 ఏళ్ల వయసులో ఎంఎ పరీక్ష రాసిన తొలి విద్యార్థినిగా దేశంలో రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో తన ప్రతిభ చూపుతున్న నైనా విద్యార్థినిగా సైతం రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పిన్న వయసులోనే పదవ తరగతి పరీక్షలు రాశారు.