తెలంగాణ

సభ్యత్వ నమోదు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తెలంగాణలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని, ఈ విషయం పార్టీ సీనియర్ నేతలు గమనించారని ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో కొద్ది సేపు పార్టీనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. రాష్ట్రంలో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని, నాయకులు జనంలో ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారన్నారు. పార్టీలో ఇతర పార్టీల నేతలు చేరడం మంచి పరిణామమన్నారు. జిల్లాలవారీగా సభ్యత్వం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు రెండున్నర లక్షల నూతన సభ్యత్వం జరిగింది. ఆగస్టు 11వ తేదీ వరకు సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.