తెలంగాణ
నేడు చంద్ర గ్రహణంతో యాదాద్రి ఆలయం మూసివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 July 2019
యాదగిరిగుట్ట, జూలై 15: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 6:30 నుంచి మూసివేయనున్నట్టు ఈవో గీత తెలిపారు. తిరిగి 17వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణతో నిత్య విధులు నిర్వహిస్తామని, చంద్ర గ్రహణం సందర్భంగా 17వ తేదీ ఉదయం నిర్వహించే ఆర్జిత సేవలు నిలిపివేసి, 9 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ సందర్శన వేళల్లో చోటుచేసుకున్న మార్పులను భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కాగా, తెలంగాణలోని మరో ముఖ్యమైన బాసర ఆలయాన్ని సైతం చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.