తెలంగాణ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆప్రజాస్వామికంగా తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు డీ. శ్రీ్ధర్ బాబు, అనసూయ, వీరయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. ఓపక్క రైతులు కరువుతో, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించకుండా కేసీఆర్ ఇష్టం వచ్చిన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా వాటి మీద చర్చించకుండా కేసీఆర్‌కు ఇష్టమైన పలుకులు వినడానికి సభను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. తమకు సభలో మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదని, అసెంబ్లీ సమావేశాలను పోడిగించి రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చ జరగాలని ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కోర్టులో ఉన్న అంశమని, దీనిపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశానికి నల్ల కండువాలతో హాజరై తెరాసలో సీఎల్పీ విలీనాన్ని ఖండించారు.
చిత్రం...మీడియా పాయంట్ వద్ద మాట్లాడుతున్న భట్టి విక్రమార్క