తెలంగాణ

నేటి నుంచి రాజీవ్‌గాంధీ జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలను మంగళవారం నుంచి రాష్ట్రంలో ఘనంగా నిర్వహించనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం హాల్‌లో మంగళవారం నిర్వహించే కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథీరాజ్ చౌహన్, మాజీ గవర్నర్ కె రోశయ్య హాజరుకానున్నారని తెలిపారు. అలాగే కశ్మీర్ అంశం, దేశ రాజకీయాలపై నిర్వహించే సదస్సులో ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ప్రముఖ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి పాల్గొంటారని వివరించారు. రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను రాష్టవ్య్రాప్తంగా నిర్వహించాలని పార్టీ నేతలు, శ్రేణులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం ఇందిరాగాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఊరూరా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాజీవ్ గాంధీ వేడుకలకు కూడా హాజరుకావాలన్నారు. ఇలా ఉండగా రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి సద్భావన యాత్రను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు.