తెలంగాణ

మల్లన్న సాగర్‌పై నేడు జెఎసి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం వేములగట్టులో మంగళవారం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజాక్) అధ్యర్యంలో ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు-ప్రతిపాదన-చర్చ’ అనే అంశంపై ఈ సదస్సునస ఏర్పాటు చేసింది. దీనిలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు న్యాయ నిపుణులు, సాగునీటి రంగ నిపుణులు, ముంపు గ్రామాల ప్రజలు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారని టిజెఎసి సమన్వయకర్త పిట్టల రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త జిల్లాలపై భేటీ వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4: కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించనున్న సమావేశం వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీన రాష్టవ్య్రాప్తంగా ప్రారంభం కానున్న హరిత హారం కార్యక్రమంలో కలెక్టర్లు బిజీగా ఉండటం వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు అధికార వర్గాల సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు తుది నివేదికలు సమర్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.