తెలంగాణ

లక్ష్మీ బ్యారేజీ 25 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, ఆగస్టు 24: జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) 25 గేట్లను అధికారులు శనివారం ఎత్తివేశారు. బ్యారేజీ సామర్థ్యం 16.17 నీటి నిల్వకు గాను ప్రస్తుతం 5.17 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 95.400 మీటర్ల లెవల్‌లో నీటి ప్రవాహం ఉండగా 2 లక్షల 16వేల క్యూసెక్కుల నీటిని ఇన్‌ఫ్లో రాగా యధావిధిగా అదే లెవల్‌లో 25 గేట్ల ద్వారా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతీ బ్యారేజీ (అన్నారం) వద్ద 10.87 టీఎంసీలకు గాను 9.23 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఈఈ రమణారెడ్డి తెలిపారు. బ్యారేజీలోకి 4వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఇన్‌ఫ్లో వస్తుందని, ప్రస్తుతం సరస్వతీ బ్యారేజీ గేట్లు మూసివేసినట్లు ఆయన తెలిపారు.