తెలంగాణ

3 కోట్ల మైలురాయి దాటిన గ్రీన్ చాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: హరితహారం కోసం తన వంతుగా టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ గత ఏడాది చేపట్టిన గ్రీన్ చాలెంజ్ శుక్రవారానికి మూడు కోట్ల మైలురాయి దాటింది. మూడవ కోటికి చిహ్నంగా సంజీవయ్య పార్క్ సమీపంలోని డైరెక్టర్ ఆఫ్ ఈవీ అండ్ డీఎం శిక్షణ మైదానంలో ఆయన మొక్కను నాటారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఈ కార్యక్రమానికి హాజరై సంతోష్‌కుమార్‌కు అభినందలు తెలిపారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ పిలుపునిచారు.