తెలంగాణ

కేశవరావును సన్మానించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నియమితులయ్యారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ కమిటీలో లోక్‌సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు ఉంటారు. ప్రతిష్టాత్మక కమిటీకి తనను చైర్మన్‌గా నియమించినందుకు కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్‌లో కేశవరావుకు కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు.

చిత్రం... పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయా సంఘం చైర్మన్‌గా నియమితులైన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
కేశవరావు సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్