తెలంగాణ
శుభ సూచకం: వినోద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేస్తూన్న ప్రకటనలు శుభసూచికంగా భావించవచ్చునని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్పొరేట్ సెక్టార్కు పన్నులు తగ్గించే ఆలోచన ఉందని సంకేతాలు ఇచ్చారని అన్నారు. గతంలోనే దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జైట్లీ ప్రకటించారని తెలిపారు. కార్పొరేట్ పన్నులు గణనీయంగా తగ్గించడంతో కేంద్రానికి పెద్ద ఎత్తున రాబడి తగ్గుతుందని అర్థమవుతుందన్నారు. ఆర్థిక మందగమనం మూలంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో భారీగా కోత పడే అవకాశం వుందని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు.