తెలంగాణ

25న ఓయూలో ఆర్టీసీ సమ్మెపై భారీ బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతూ ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాల జాక్ ప్రకటించింది. బహిరంగసభకు సంబంధించిన పోస్టర్‌ను టీ ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం నాడు ఆవిష్కరించారు. మరో కార్యక్రమంలో సామాజిక న్యాయ జాక్ చైర్మన్ , తెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా హయత్‌నగర్ బస్ డిపోలో అఖిలపక్ష నాయకులు సైతం బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేర్వేరుగా జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆర్టీసీ జాక్ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే యాకుబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.