ఆంధ్రప్రదేశ్‌

ధవళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద గోదావరి ఉద్ధృతి తగ్గింది. ఎగువ ప్రాంతంలో ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 9 అడుగులకు తగ్గింది. 5,29,591 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఇంకా అన్ని గేట్లను ఎత్తివేసి జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. బ్యారేజి దిగువన కోనసీమలోని నదీ పాయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఏటిగట్ల వద్ద ఇంకా పహరా కొనసాగిస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఎగువన భద్రాచలం వద్ద నీటిమట్టం 33.9 అడుగులకు చేరుకుంది. గోదావరి నది ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం వద్ద 6.8 మీటర్లు, పేరూరు వద్ద 9.5 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 9.5 మీటర్లు, కూనవరం వద్ద 12.8 మీటర్లు, కుంట వద్ద 4.6 మీటర్లు, కొయిదా వద్ద 17.33 మీటర్లు, పోలవరం వద్ద 11.34 మీటర్ల నీటి మట్టం నమోదైంది.