తెలంగాణ

మాలధారణ మహాపాపమా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి: అయ్యప్ప మాల వేసుకో వడంతో ఒక విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించని సంఘటన భువనగిరిలో జరిగింది. దీనికి ఆగ్రహించిన అయ్యప్పస్వాములు పాఠశాలవద్ద ధర్నా నిర్వహించడంతో పాటు పాక్షికంగా ఫర్నిచర్ ధ్వసంచేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. స్థానిక ఇండియా మిషన్ పాఠశాలలో 4వ తరగతి చదువుచున్న ఎం.ప్రణీత్‌రెడ్డి తన తండ్రి శివారెడ్డితో పాటు అయ్యప్పమాల వేసుకున్నాడు. అయతే పాఠశాల కరెస్పాండెంట్ జూడా మాల ధరించినన్ని రోజులు స్కూలుకు రావద్దని విద్యార్థిని తిప్పి పంపారు. విషయం తెలుకున్న అయ్యప్పసేవాసమితి, హిందూ సంస్థల ప్రతినిధులు ఒక్కసారిగా పాఠశాలలోకి చొరబడి జూడాను ప్రశ్నించేందుకు వెళ్లగా ఆయన కన్పించక పోవడంతో ఆగ్రహానికి గురై పాఠశాల కార్యాలయంలో ఫర్నిచర్‌ను చిందరవందర చేశారు. అనంతరం పాఠశాలలో రెండు గంటల పాటు బైఠాయించి భజన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశంచేసి ఆందోళనకారులకు సర్దిచెప్పినా వినకపోవడంతో పాఠశాల కరెస్పాండెంట్ జూడాను పోలీసు బందోబస్తు మధ్యన తీసుకుని వచ్చి అయ్యప్పస్వాములకు, హిందూసంస్థల ప్రతినిధులకు క్షమాపణ చెప్పించారు. తర్వాత విద్యార్థి ప్రణీత్‌రెడ్డిని పాఠశాలలోకి అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో మాలధారులు విశ్వరూప గురుస్వామి, రాజు గురుస్వామి, రత్నపురం శ్రీశైలం, హిందుసంస్థల ప్రతినిధులు తోట భాను, పట్నం కపిల్, పుల్ల శివ, చామ రవీందర్, గీస ఆనంద్, ఆకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... పాఠశాలవద్ద అయ్యప్పస్వాముల ధర్నా