తెలంగాణ
ప్రొఫెసర్ మీనాకుమారి ఆకస్మిక మృతి పట్ల సీపీఐ దిగ్భ్రాంతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 January 2020
హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ నిమ్స్లోలో సీనియర్ న్యూరో ఫిజిషీయన్గా పని చేస్తున్న ప్రొఫెసర్ మీనాకుమారి ఆకస్మిక మృతి పట్ల సీపీఐ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు. ఆమె పట్టుదలకు మారుపేరన్నారు. ఆమె లండన్లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ మరణించడం జరిగిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ఆయన తెలిపారు.