తెలంగాణ

మూడుచోట్ల నేడు రీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీల్లోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వ వార్డులోని 198వ పోలింగ్ కేంద్రంలో, కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101 వ పోలింగ్ కేంద్రంలో, బోధన్ మున్సిపాలిటీ 32 వార్డుకు సంబంధించిన 87 వ పోలింగ్ కేంద్రంలో శుక్రవారం రీ-పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. టెండర్ ఓట్లు పోల్ కావడం వల్ల రెండుచోట్ల, నిబంధనలను అతిక్రమించి ఎన్నికల సిబ్బంది పనిచేసినందువల్ల ఒకచోట రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మూడు కేంద్రాల్లో రీ-పోలింగ్ శుక్రవారం ఉదయం 7 నుండి సాయం త్రం 5 గంటల వరకు ఉంటుందని ఈసీ ప్రకటించింది. రీపోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల కు పంపిస్తారు. శనివారం కౌంటింగ్ ఉంటుంది.