తెలంగాణ

ఇంటర్ ఎథిక్స్ పేపర్‌కు 14,811 మంది గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు మంగళవారం నాడు నిర్వహించిన ఎథిక్స్ పేపర్‌కు 14,811 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 4,90,462 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 4,75,651 మంది హాజరయ్యారు. 3.02 శాతం మంది గైర్హాజరయ్యారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
మార్చి 1న ఆర్‌జేసీ సెట్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకూ పొడిగించినట్టు కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. లిఖిత పరీక్షను మార్చి 1వ తేదీన నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అలాగే సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లో ఆరో తరగతి నుండి 9వ తరగతి వరకూ ఖాళీలను సైతం భర్తీ చేస్తామని, అందుకు దరఖాస్తు చేసుకునే గడువు జనవరి 31 వరకూ ఉందని, ప్రవేశపరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహిస్తామని తెలిపారు.