తెలంగాణ

టీఆర్టీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి: వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకానికి నిర్వహించిన టీఆర్‌టీ రిక్రూట్‌మెంట్ నియామకాలను వెంటనే చేపట్టాలని దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులు నిమ్స్ ఆస్పత్రి ముందు సోమవారం నాడు ధర్నా చేశారు. దివ్యాంగులకు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వీ హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల కోటాలోని దాదాపు 530 ఎస్‌జీటీ స్కూలు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఎస్‌పీ క్రాంతికుమార్ తదితరలు పాల్గొన్నారు.