తెలంగాణ

లోకేశ్‌కు కోపం వచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: అసలే అంతర్గత కలహాలతో అట్టుడుకున్న ప్రకాశం తెదేపాలో, కొత్తగా డిసిసిబి అవిశ్వాస వ్యవహారం పార్టీ యువనేత లోకేష్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ఒకొకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని, అవిశ్వాసం వరకూ వెళ్లడంతో రంగంలోకి దిగిన లోకేష్ జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ రాజీ చేయాలని ఆదేశించారు. దీంతో వైస్ చైర్మన్ రాజీనామా లేఖ చూపి డిసిసిబి చైర్మన్‌ను బుజ్జగించి, గండం నుంచి గట్టెక్కిన వైనం తెదేపాలో హాట్ టాపిక్‌లా మారింది. ఈ వ్యవహారంతో కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలపై తొలిసారి విజయం సాధించినట్టయింది.
ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్ ఈదర మోహన్-వైస్ చైర్మన్ మస్తానయ్య మధ్య కొద్దికాలం నుంచి అంతర్గత పోరు జరుగుతోంది. ఈ క్రమంలో వీసీ మస్తానయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చైర్మన్, రాష్ట్ర సహకారశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, 10వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు. దానితో రంగంలోకి దిగిన మంత్రి శిద్దారాఘరరావు, కరణం బలరాం, డి.జనార్దన్, ఎమ్మెల్యే సాంబశివరావులు మంత్రి బొజ్జలను కలసి అవిశ్వాసం లేకుండా స్టే తీసుకువచ్చారు. దానిపై ఆగ్రహించిన చైర్మన్ మోహన్ కోర్టుకెళ్లారు. మంత్రి ఇచ్చిన స్టే వర్తించదని, మళ్లీ అవిశ్వాసం పెట్టాలని అధికారులను ఆదేశించగా, మంగళవారం అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యాన వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి, అశోక్‌రెడ్డి, రామారావు కలసి ఈ వ్యవహారంపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
ఒకే పార్టీకి చెందిన నేతపై కుట్ర చేస్తున్నారంటూ చైర్మన్ మోహన్‌కు మద్దతుగా నిలిచారు. దీనితో పాతకొత్త నేతల మధ్య పోరు మొదలయింది. నిజానికి కరణం-జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌కు విబేధాలున్నాయి. కొత్త ఎమ్మెల్యేలకు జనార్దన్ మద్దతునిస్తున్నప్పటికీ, డిసిసిబి వ్యవహారంలో మాత్రం జనార్దన్, మంత్రి రాఘవరావు, కరణం, సాంబశివరావు మాత్రం వీసీ మస్తాన్‌కు బాసటగా నిలవడం గమనార్హం.
పార్టీ పరువు బజారుకెక్కే పరిస్థితి రావడంతో రంగంలోకి దిగిన లోకేష్.. మంత్రి శిద్దా, జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణం చైర్మన్-వైస్ చైర్మన్ మధ్య రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దానితో విధిలేని పరిస్థితిలో సోమవారం జనార్దన్ చైర్మన్ మోహన్‌తో చర్చించారు. నెలరోజుల తర్వాత వైస్ చైర్మన్‌తో రాజీనామా చేయిస్తామని చెప్పి, మంగళవారం ఉదయానికి వైస్ చైర్మన్ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్‌కు చూపించడంతో ఆయన శాంతించారు.