తెలంగాణ

భద్రాద్రి రామయ్యకు అభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 1: అంత్య పుష్కరాల సందర్భం గా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామ దివ్యక్షేత్రంలోని గోదావరి తీరం సోమవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జీవనది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో గోదావరి తీరంలో పునర్వసు మంటపంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ప్రచారమూర్తులను కొలువుతీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామికి అభిషేకం చేశారు. గోదావరిలో లాంచీని పూలతో అలంకరించి భక్తుల దర్శనార్థం దానిపై స్వామివారిని ఉంచారు. భక్తులు ఉత్సాహంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పుష్కర స్నానాలు ఆచరించారు.