ఆంధ్రప్రదేశ్
‘దళితులపై దాడులను స్వామీజీలూ ఖండించాలి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 August 2016
హైదరాబాద్, ఆగస్టు 13: దళితులపై దాడులను హిందూ మత పర్యవేక్షకులు, స్వామీజీలు కూడా బాధితులు పక్షాన నిలిచి ఖండించాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సూదాపాలెంలో ఆవు చర్మాన్ని తీశారనే ఆరోపణలు ఎదుర్కొన్న దళితులపై జరిగిన దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, ఈ ఘటనపై సిఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు అందించడం జరిగిందని మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం నేరస్థులను పట్టుకుందని , ఇటువంటి ఘటనలు జరిగినపుడు హిందూ మత పరిరక్షకులు సైతం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ధార్మిక సంస్థల నుండి ప్రతినిధులు వచ్చి బాధితులను పరామర్శించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని పేర్కొన్నారు.