తెలంగాణ
ప్రేమకు సై.. పెళ్లికి నై..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిగురుమామిడి, ఆగస్టు 20: ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించిన ప్రబుద్ధుడు పెళ్లికి మాత్రం నిరాకరించాడు. ఐదు లక్షలు తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటానని దబాయంచడంతో మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల సుజాత (23) గత కొనే్నళ్లుగా కరీంనగర్లో ఓ ప్రయివేటు నర్సింగ్హోమ్లో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో చినముల్కనూర్ గ్రామానికి చెందిన దొబ్బల మహేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సుజాత తనకు వచ్చే నెల జీతం డబ్బులు రూ.9 వేలను సైతం మహేష్కు ఇచ్చేదని, కొద్దిరోజులు ప్రేమ పేరుతో వంచించి, తీరా ఇప్పుడు పెళ్లి చేసుకొమ్మంటే మొహం చాటేశాడు. ఐదు లక్షలు తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటున్నానని, లేకుంటే చేసుకోనని తెగేసి చెప్పడంతో ప్రేమలో విఫలమైంనందుకు తనువు చాలిస్తున్నానని, మహేష్ను కఠినంగా శిక్షించాలని సుజాత శుక్రవారం రాత్రి సూసైడ్ నోట్రాసి సుందరగిరిలోని తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ సంఘటనతో మృతురాలి బంధువులు, గ్రామస్థులు సుజాత మృతదేహంతో చిన ముల్కనూర్ బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని మహేష్ ఇంటి ఎదుట ఉంచి, కరీంనగర్-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుజాత మృతికి కారణమైన మహేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. హుస్నాబాద్ ఎస్ఐ కిరణ్ వచ్చి మృతురాలి కుటుంబీకులతో మాట్లాడి మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని హుస్నాబాద్ సిఐ ఆఫీస్కు తరలించినట్టు సమాచారం. శనివారం రాత్రి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.