తెలంగాణ

సబ్‌కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఆగస్టు 20: మాజీ మంత్రి కొట్నాక భీంరావు విగ్రహం ఏర్పాటు విషయంలో సబ్‌కల్టెర్, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. విగ్రహ ఏర్పాటు పనులకు అనుమతులు తెచ్చుకోవాలని సబ్‌కలెక్టర్... తమ ప్రభుత్వంలో మీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే ఇద్దరూ భీష్మించుకొని కూర్చోవడం అటు అధికారులు... ఇటు రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా పరిణమించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...ఈనెల 29న తన తండ్రి, మాజీ మంత్రి కొట్నాక భీంరావు వర్ధంతి నేపథ్యంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొంత మంది సూచన మేరకు జూబ్లీమార్కెట్‌కు వెళ్లేమార్గంలోని ఆర్‌అండ్‌బి రోడ్డుపై విగ్రహం ఏర్పాటుకు గుంత ను తవ్వించారు. అయతే, ఆర్‌అండ్‌బి రోడ్డుపై విగ్రహాల ఏర్పాటుకు ఎలాం టి అనుమతులు లేవంటూ శుక్రవారం రాత్రి సబ్‌కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ పనులు నిలిపి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతలు, గిరిజన సంఘాలు తొలుత ఆందోళన చేయాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై గుమిగూడిన తెరాస నాయకులు, కార్యకర్తలతో సబ్ కలెక్టర్ చర్చించారు. నడిరోడ్డుపై పనులు చేసేందుకు అనుమతి లేదని ఆయన వారికి తేల్చిచెప్పారు. దీంతో వెనక్కి తగ్గిన టిఆర్‌ఎస్ నాయకులు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం మాజీ మంత్రి విగ్రహాన్ని పెద్దవాగు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈమేరకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శనివారం మధ్యాహ్నం అధికారులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌అండ్‌బి అధికారులు కొలతల ప్రకారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న సబ్‌కల్టెర్ అద్వైత్‌కుమార్ సింగ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతి లేదంటూ పనులు ఆపించడంతో పాటు, అక్కడే ఉన్న జెసిబి, ఇతర యంత్రాలను సీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇది అన్యాయం అంటూ, ఇంకా గిరిజనులను అవమానాలు తప్పడం లేదని ఆగ్రహిస్తూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పనులు నిలిపి వేసిన చోటికి చేరుకొని సబ్‌కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆదివాసీ నాయకుడి కోసం చేపడుతున్న పనులు ఆపడం గిరిజనులను అవమానించడమే అంటూ మండి పడ్డారు. ఇష్టారాజ్యంగా చట్టాలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని అధికారులు ఓ ఆదివాసీ నాయకుడి విగ్రహ ఏర్పాటుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిండం సరికాదని ఎమ్మెల్యే సబ్‌కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై స్పందించిన సబ్‌కల్టెకర్ ఎవరి అనుమతి తీసుకొని పనులు ప్రారంభించారని, అనుమతి పొందిన తరువాతే పనులు మొదలెట్టాలని స్పష్టం చేశారు. సబ్‌కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యే బహిరంగంగానే ఘాటుగా స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ దశలో కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో, అనుమతి లభించే వరకు ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. అవసరమైతే ఆదివాసీలతో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించింది. ఇవేమీ ఖాతరు చేయని సబ్‌కలెక్టర్ ఎంతటి వారైనా నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉం టుందని పేర్కొన్నారు.
పరిస్థితి చేజారకుండా ఉండేందుకు పనులు జరిగే ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. పెద్దవాగు ప్రాంతంలో భారీగా మొహరించిన పోలీసులు తెరాస నాయకులు, కార్యకర్తలతో పాటు జనాలను పం పించి వేశారు.

చిత్రం.. సబ్‌కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి