తెలంగాణ

సర్కారు వైఖరిని జనంలో ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: మజ్లిస్ ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని 58 డివిజన్లకు ఇటీవల నూతన అధ్యక్షులను పార్టీ ఎన్నుకున్నది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కొత్త అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశానికి 50 మంది డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ మజ్లిస్‌కు అనుకూలంగా ఉంటున్న ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ నాయకులు స్కూటర్ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి మజ్లిస్‌కు భయపడి ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌కు వచ్చిన గుజరాత్ సిఎం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 26: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్వాగతం పలికారు. విజయ్ రూపానీ హైటెక్ సిటీలో గల ఒక కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన తన బంధువుల వివాహానికి హాజరయ్యారు.