తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 26: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో సిరివేని పరమేశ్ (17), దారం ఎల్లయ్య (32)లు అక్కడి కక్కడే మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రభాకర్ (34)అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా మండలంలోని జిల్లెల్లకు చెందిన ప్యాసింజర్ ఆటో సిరిసిల్ల నుండి జిల్లెల్ల వైపు వెలుతుండగా అటు వైపు నుండి ఖాలీ లారీ దూసుకవస్తూ తంగళ్ళపల్లిలోని ప్రభుత్వ హైస్కూలు మూల ములుపు వద్ద ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇంటర్ చవువుతున్న జిల్లెల్ల వాసి పరమేశ్, దారం ఎల్లయ్యలు అక్కడి కక్కడే మృతి చెందారు. ప్రభాకర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా స్థానికులకు దొరకకుండా లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ అయ్యారు. గాయాలకు గురైన ఎనిమిది మంది క్షత్రగాత్రులకు సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. సిరిసిల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.