తెలంగాణ

మండలిలో చీఫ్ విప్‌గా పాతూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: శాసనమండలి (కౌన్సిల్)లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పాతూరి సుధాకర్ రెడ్డిని, ప్రభుత్వ విప్‌లుగా బి. వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన పాతూరి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, పదవికి వనె్న తెస్తానని అన్నారు. శాసనమండలిలో చర్చలు అర్థవంతంగా, ఫలప్రదంగా జరుగుతాయని ప్రజానీకానికి చాటేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.