తెలంగాణ

నరుూం నేరసామ్రాజ్యం వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఆగస్టు 29 : నరుూం చీకటి నేర సామ్రాజ్యం వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర ఉందని, నరుూంతో శాసనమండలి ఎన్నికల్లో గెలుపుకోసం కోమటిరెడ్డి బ్రదర్స్ చేసుకున్న ఒప్పందం బయటపడుతుందన్న భయంతోనే వారు సిట్ విచారణను వ్యతిరేకిస్తున్నారని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీమంత్రి ఉమామాధవరెడ్డిని అడ్డుపెట్టుకొని 5 కోట్లు నరుూంకు ఇచ్చి స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించి గెలిచారని ఆరోపించారు. 2009 ఎన్నికల సమయంలో రాజగోపాల్‌రెడ్డిని నరుూం బెదిరిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నించారు. నరుూంను సృష్టించింది చంద్రబాబునాయుడు అయితే పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని విమర్శించారు. గతంలో రాజీవ్ గాంధీ హత్య, గోద్రా అల్లర్లు, ఆంధ్రా ఎర్రచందనం కేసులలో సిట్ విచారణ విజయవంతమయ్యాయని వారు గుర్తు చేశారు. నరుూంతో నష్టపోయింది ఒక్క టిఆర్‌ఎస్ పార్టీనేని సాంబశివుడు, రాములు వంటి నేతలను కోల్పోయిందన్నారు. తనను చంపుతామని బెదిరించి 5 కోట్ల డీల్ కుదిరిందంటూ కోమటిరెడ్డి స్వగ్రామం నుంచి వచ్చిన బె దిరింపు వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ హస్తం ఉండవచ్చని ఆరోపించారు. క్రాంతిసేన పేరుతో ముగ్గురు ఎమ్మెల్యేలను చంపుతామంటూ వెలువడిన ప్రకటన వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్రపై అనుమానం ఉందని వారు ఆరోపించారు. శాంతిభద్రతల విషయంలో కేసిఆర్ ప్రభుత్వం రాజీపడబోదని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు అన్నారు.