తెలంగాణ

హిందు, ముస్లింల మధ్య తగాదాలు పెట్టాలనుకుంటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, సెప్టెంబర్ 3: కేంద్ర మంత్రి, బిజెపి నేత వెంకయ్యనాయుడు తెలంగాణలో హిందు, ముస్లింలకు తగాదాలు పెట్టి కొట్లాడుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా భారతదేశంలో తెలంగాణ విలీనం చేసిన దినోత్సవంగా ప్రభుత్వం పాటిస్తుందని ఆమె అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గద్వాల ఎమ్మెల్యే అరుణ తెలంగాణ బొమ్మాళీగా మారారని వ్యాఖ్యానించారు. కొంతమంది పెద్ద నాయకులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాలను జిల్లా చేయాలని ఎమ్మెల్యే అరుణ, కాంగ్రెస్ నాయకులతో కలిసి దీక్ష చేస్తూ సిఎం కెసిఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎవరూ అరుణమ్మ రీతిగా మాట్లాడరని, అలా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. అరుణమ్మ వెంటనే దీక్షను విరమించి గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని ఆమె సూచించారు. జగిత్యాల జిల్లా కోసం ఎన్నో ఎళ్లుగా డిమాండ్ ఉండడంతోనే ప్రభుత్వం జగిత్యాలను జిల్లా ప్రకటించిందని అన్నారు. కెసిఆర్ అధికారులతో సమాలోచనలు జరిపి సర్వే నిర్వహించిన అనంతరమే జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు.