తెలంగాణ

యాదాద్రి జిల్లా కేంద్రానికి టిడిపి పూర్తి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్1: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మోత్కుపల్లి దీక్షకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌వి రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు పూర్తి మద్దతును ప్రకటించారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిలో తహసిల్దార్ కార్యాలయం ముందు యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మోత్కుపల్లి నర్సింహులు చేయతలపెట్టిన ఒకరోజు ఉపవాస దీక్షకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై తమ పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 జిల్లాల ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించి అన్ని మెరుగైన నాణ్యమైన వసతులు కల్పిస్తే ప్రముఖుల రాకతో దేశంలోనే అత్యుత్తమ దేవాలయంగా వెలుగొందుతుందని, అలాగే ఎన్నో వౌలిక వసతులు కల్పిస్తే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. తెలుగుదేశం హయాంలో పటేల్ పట్వారీ వ్యవస్థ నుండి మండ ల వ్యవస్థను తీనుకు వచ్చి తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చిన చరిత్ర తెలుగు దేశానిదని, క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు 30 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఆయన యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటే తాము మద్దతుస్తామన్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడతామని కెసిఆర్ ఏదైన వంకర బుద్దితో యాదాద్రిని తీసుకు వెళ్లి ఇతర నియోజక వర్గాలలో కలిపితే ఊరుకోమన్నారు. మోత్కుపల్లి మాట్లాడుతూ యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు ఉద్య మం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మనసు మార్చుకొని యాదాద్రి అభివృద్ధి గురించి వందల కోట్లు వెచ్చిస్తుంటే మేము దానికి వ్యతిరేకం కాదని అయితే యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఎన్నో వనరులు, ఉపాధి, ఉద్యోగాలు, ప్రజలకు అందుబాలలో ఉంటాయన్నారు. యాదాద్రి జిల్లా కొరకై త్వరలో గిరి ప్రదక్షిణం (మాలధారణ)తో చేస్తామని, స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తామని, ఒకవేళ జిల్లా కేంద్రంగా ప్రకటించక పోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ దీక్షలో అఖిలపక్షం నాయకులు టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కైరంకొండ శ్రీదేవి, బిజెపి రాష్ట్ర నాయకులు కాం సం వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నర్సింహు లు, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు చంద్రవౌళిగౌడ్, ఎమ్‌ఆర్‌పి యస్ రాష్ట్ర నాయకులు మంద శంకర్‌మాదిగ, వైఎస్‌ఆర్ రాష్ట్ర నాయకులు వడ్లోజు వెంకటేష్, టిడిపి రాష్ట్ర నాయకులు గొల్ల మల్లయ్య, నన్నూరి నర్సింహరెడ్డి, పల్లెపాటి బాలయ్య, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మోత్కుపల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేస్తున్న రమణ, ఎర్రబెల్లి