తెలంగాణ

మిరప రసం తాగించి..అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో అనేక అకృత్యాలు వెలుగుచూస్తున్నాయి. నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం అతని ఇంట్లో ఉన్న మైనర్ బాలికలను స్టేట్ హోంకు రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం వారిని విచారించారు. నరుూం అత్త సుల్తానా, తాహెరా, హసీనా బేగం, సలీమా, సానియా, ఫరుూంలు మాట వినకపోతే కొట్టేవారని, నరుూం లైంగికంగా వేధించేవాడని, వినకపోతే మిరప రసం తాగించి అత్యాచారం చేసి మందులు వేసే వాడని బాధిత బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజులకోసారి నరుూం గదిలోకి వెళ్లమని వీరంతా వేధించే వారని బాలికలు ఆరోపించారు. ఎవరి మాట వినకపోయినా ఆ రోజు నరకం చూపేవారని, మిర్చీ రసం తాగించి అత్యాచారం చేసే వారని పోలీసుల విచారణలో బాలికలు నరుూం అకృత్యాలను బయటపెట్టారు. దీంతో నరుూం ఇంట్లోని బాలికలను సాక్షులుగా పేర్కొంటూ సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. నరుూం తమను కొట్టడమే కాకుండా లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలికలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఓ సిట్ అధికారి తెలిపారు. తమ కళ్ల ముందే జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించిన ఓ బాలికను నరుూం హత్య చేశాడని బాలికలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నరుూం అత్త సుల్తానా, పెళ్లి చేస్తానని ఆరేళ్ల క్రితం తీసుకొచ్చిందని మరో బాలిక పోలీసుల ఎదుట చెప్పింది. కీచక గ్యాంగ్‌స్టర్ నరుూం, అతని అనుచరులపై హత్య, అత్యాచారం, వేధింపులు సెక్షన్ల కింద కేసులు పెట్టామని సిట్ అధికారులు తెలిపారు. కాగా రిమాండ్ ముగిసిన నరుూం అనుచరులు కొంతమందిని కోర్టులో హాజరుపరచారు. నరుూం అకృత్యాలపై మరింత సమాచారం సేకరించే నిమిత్తం వీరిని మరో పక్షం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.