తెలంగాణ

మోదీ ఇమేజ్ మరింత పెరిగింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశ సైన్యం దాడి చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట మరింత పెరిగిందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టి.టిడిపి నేతలతో అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పాక్ దుశ్చర్యకు సరైన సమాధానం చెప్పారని అన్నారు. దేశ ప్రజలు కోరుకున్నదే ప్రధాని మోదీ చేశారని ఆయన తెలిపారు. ఇలాఉండగా తెలంగాణలో జిల్లాల సంఖ్యను రోజు, రోజుకూ పెంచుతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా, చంద్రబాబు చిన్నగా నవ్వి స్పందించకుండా మరో అంశంపై చర్చను చేపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాఉండగా దసరా పండుగ తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే తొలుత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ శిక్షణా తరగతులను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.