తెలంగాణ

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 3: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సటేబయానార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లీ అటవీ ప్రాంతంలో జిల్లా బలగాలు, చత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ పోలీసులు సంయుక్తంగా సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసు బలగాల ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మిగిలిన వారు అడవిలోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహంతో పాటు పిస్టల్, భారీగా పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు లభ్యమయ్యాయి. రాత్రివేళ కావడంతో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేశామని, బలగాలను వెనక్కి పిలిపించామని, మృతి చెందిన మావోయిస్టును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొండగావ్ ఎస్పీ సంతోష్ సింగ్ వివరించారు.