తెలంగాణ

శ్రీరాంసాగర్ నుంఛి 9 లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తొమ్మిది లక్షల ఎకరాలకు రబీలో సాగునీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అదే విధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రెండవ పంటకు ఆరు లక్షల 40వేల ఎకరాలకు సాగరు ఇవ్వనున్నట్టు చెప్పారు. రబీపంటకు సాగునీటిపై రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. దీని కోసం బుధవారం జల సౌధలో చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం జరుపుతారు. రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణను జిల్లాల వారిగా ప్రాజెక్టుల వారిగా రూపొందించాలని మంత్రి సూచించారు. బుధవారం నాటి సమావేశంలో జిల్లాల వారిగా, ప్రాజెక్టుల వారిగా కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు. అదే విధంగా మిషన్ కాకతీయ రెండవ దశల్లో చేపట్టిన పనులు, ఫలితాలపై విశే్లషించి, మూడవ విడత మిషన్ కాకతీయ పనుల ప్రారంభంపై చర్చిస్తారు. ఖరీఫ్‌లో ఏయే ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందించారో నివేదికలతో బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీరామ్‌సాగర్ స్టేజ్ 1, స్టేజ్ 2, వరద కాలువ, నాగార్జున సాగర్, శ్రీశైలం, నిజాంసాగర్ , ఎల్లంపల్లి సింగూర్, మూసి, కడెం, జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి రబీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని హరీశ్‌రావు సిఇలను ఆదేశించారు. శ్రీరామ్‌సాగర్ స్టేజ్1లో మిగిలిపోయిన కాలువల మరమ్మత్తులు, ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.
సాగర్ ఎడమ కాలువకు సంబంధించి పెండింగ్ పనులన్నింటినీ శర వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల వారిగా రబీ పంటకు ఉన్న నీటి లభ్యత, మిషన్ కాకతీయ ఫలితాలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లో సమస్యలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.