ఆంధ్రప్రదేశ్‌

ఎఎంసి చైర్మన్ల పేర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, అక్టోబర్ 22: ఎంతోకాలం నుండి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆచంట నియోజకవర్గంలో పెద్ద నామినేటెడ్ పదవులైన ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, పెనుగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు పేర్లు ఖరారయ్యాయి. మార్కెట్ కమిటీలకు పాలకమండళ్ళను ఖరారుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందునుంచి అనుకుంటున్నట్టు గానే ఆచంట ఎఎంసి ఛైర్మన్‌గా ఉప్పలపాటి సురేష్‌బాబు పేరు ఖరారైంది. గత మూడు సంవత్సరాలు నుండి తెలుగుయువత నాయకుడిగా ఆచంట నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సురేష్‌బాబును ఎఎంసి ఛైర్మన్‌గా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. కాగా వైస్ ఛైర్మన్‌గా పోడూరుకు చెందిన సీనియర్ నాయకుడు రుద్రరాజు సీతారామరాజు(రవి) పేరు ఖరారైంది. కాగా ఆచంట నియోజకవర్గంలోని మరొక వ్యవసాయ మార్కెట్ కమిటీ అయిన పెనుగొండ ఎఎంసి ఛైర్మన్‌గా పెనుమంట్ర మండలానికి చెందిన సానబోయిన గోపాలకృష్ణ, పెనుగొండ మండలం రామన్నపాలెంకు చెందిన బడేటి బ్రహ్మాజీ పేర్లను ఖరారు చేస్తూ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.