తెలంగాణ
రైతుపై అడవి పంది దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 October 2016
మెదక్ రూరల్, అక్టోబర్ 23: మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండల పరిధిలోని శాలిపేట శివారులో ఆదివారం సాయంత్రం వరిపంట వద్దకు వెళ్లిన రైతు యెల్ల పెద్ద ఎల్లయ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తొడకు, చేతికి గాయాలు కావడంతో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇటీవల శాలిపేట శివారులో పందుల నుంచి పంట రక్షణకు ఏర్పాటుచేసిన విద్యుత్ కంచె రైతు ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. అడవి పందులు నష్టపరిచిన పంటలకు అటవీ శాఖ ఇస్తున్న పరిహారం కంటితుడుపులా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల వైపు అడవి పందులు రాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చిత్రం.. తీవ్రంగా గాయపడిన ఎల్లయ్య (ఇన్సెట్లో గాయం)