తెలంగాణ

దేవాలయాలకు పునర్వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభు త్వం తీసుకుంటోందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. జీతభత్యాల విషయంలో దేవాదాయ శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికపై క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్‌కమిటీ అభిప్రాయపడింది.
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖను పటిష్టపరచడం, అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీత భత్యాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సచివాలయంలో సమావేశం అయ్యారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీత భత్యాలు ప్రధాన అజెండాగా చర్చించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ వ్యయం 30శాతం లోగా ఉన్న ఆలయాలు ఎన్ని? 30శాతం మించి వ్యయం ఉన్న ఆలయాల సంఖ్య, ఒప్పంద ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, రోజు వారీగా వేతనాలు తీసుకుంటున్న సిబ్బంది వివరాలు అన్నింటినీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. దేవుడి మాన్యాల పరిరక్షణకు చర్యలు దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించాల్సిన బాధ్య త అందరిపై ఉందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఆలయాల వారిగా దేవాదాయ శాఖ భూముల వివరాలను అందించాలని కేబినెట్ సబ్‌కమిటీ అధికారులను కోరింది. దేవాదాయభూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటూనే వాటి నుంచి ఆదా యం పెంచుకునే మార్గాలను ఆనే్వషించాలని సూచించింది.
ట్రిబ్యునల్ ఆదేశాల
అమలుకు చర్యలు
దేవాదాయ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు తగిన చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ సూచించింది. ఆదేశాల అమలులో ఇప్పటి వరకు జరుగుతున్న జాప్యా న్ని నివారించే విధంగా సూచనలు చేయాలని కోరింది. దేవాదాయ శాఖకు సంబంధించి వివిధ కోర్టుల్లో దాఖలయ్యే వ్యాజ్యాలపై వాదనలు వినిపించేందుకు లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. దీనితో పాటు విజిలెన్స్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది.
ధూపదీప నైవేద్య పథకం
ధూపదీప నైవేద్య పథకాన్ని కొత్తగా మరిన్ని ఆలయాలకు వర్తింపజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆలయాల వారీగా నివేదికలను సిద్ధం చేయాని అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. దూపదీప నైవేధ్యం కింద గతంలో రెండువేల రూపాయలు ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఆరువేల రూపాయలకు పెంచింది. కాగా ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖ చట్టానికి సవరణలు చేయాలని కేబినెట్ సబ్‌కమిటీ అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఉన్న విధానం వల్ల కామన్ గుడ్ ఫండ్ కింద వీకర్ సెక్షన్ కాలనీల్లో నిర్మించే ఆలయాల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనికి ఉత్తమమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. వీటితో పాటు దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందున భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కమిటీ స్పష్టం చేసింది. మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కృష్ణవేణి, శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు