తెలంగాణ

స్పీకర్ ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అక్టోబర్ 28: పరకాలలో రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పరకాల మండలాన్ని ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలుపుతూ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళన సెగ శుక్రవారం తెలంగాణ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఉద్యమ సెగ తాకింది. స్పీకర్, ఎమ్మెల్యే వాహనాన్ని వెళ్లకుండా అఖిల పక్షం, రెవెన్యూ సాధన సమితి, మాదారం కాలనీకి చెందిన మహిళలు, స్థానికులు స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకోతో అడ్డుకున్నారు. రోడ్డుపై అర్థనగ్నంగా పండుకొని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాలని, పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ దరిమిలా వాహనాల నుండి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిగి వారి వద్దకు వస్తుండగా రాస్తారోకో చేస్తున్న వారికి మద్దతుగా కుల సంఘాల నాయకులు, బిసి సంక్షేమ సంఘం, స్థానికులు వారికి ఎదురుగా రావడం పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాతావరం వేడెక్కింది. వారికి నచ్చచెప్పడానికి స్పీకర్ మధుసూదనాచారి ప్రయత్నించగా వారు ససేమిరా అంటూ నినాదాలు చేశారు. ఒక పక్క నినాదాలు, మరో పక్క మహిళలు నిలదీయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వారి నుద్దేశించి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. అనంతరం పోలీసులు వారిని తొలగించి వారికి దారి ఇవ్వడంతో వారు వాహనాలలో వెళ్లారు.

చిత్రం.. రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడుతున్న స్పీకర్ మధుసూదనాచారి