ఆంధ్రప్రదేశ్‌

రూ.500 మాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 9: నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదేనని సామాన్యులు అభిప్రాయపడుతున్నప్పటికీ వారికి తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వ్యాపారులు బేఖాతరు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ముప్పతిప్పలు పడ్డారు. రైల్వే, ఆర్టీసీ, ఆసుపత్రుల్లో ఈ నోట్లు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలు కాలేదు. దీంతో ప్రయాణికులు, ఇతర వర్గాలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 రద్దు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో సామాన్యులు అయోమయంలో పడ్డారు.