తెలంగాణ

క్యూలోనే గుండెపోటు... పెన్షనర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, నవంబర్ 16: నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చిన ఓ పెన్షనర్ మృతి చెందాడు. పింఛన్ కోసం క్యూలైన్లో నిలుచున్న హనుమంతు (68) అనే రిటైర్డు ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో బుధవారం జరిగింది. పెబ్బేరు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు హనుమంతు మంగళవారం స్థానిక ఎస్‌బిఐ వద్ద పింఛన్ డబ్బులకోసం క్యూలైన్లో నిలుచొని డబ్బులు తీసుకొని మెట్లు దిగుతూ గుండెపోటుతో కిందపడిపోయాడు. అతన్ని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయన విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.