తెలంగాణ
మార్కెట్ విలువ ఎందుకు పెంచలేదు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 November 2016
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణలో ఆస్తుల మార్కెట్ విలువ ఎందుకు పెంచలేదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు వారం రోజుల గడువు విధించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్(పిల్)ను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ ఎ శంకర్ నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కొత్త భూ సేకరణ చట్టం -2013 ప్రకారం మార్కెట్ విలువలను పెంచారా లేదా అనేది అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డిని ఆదేశించింది.