తెలంగాణ

టిఆర్‌ఎస్ పాలనపై మహిళల మహోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ప్రధాని మోదీ ఉదాత్త ఆశయాలతో పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో సాధించలేనిది, బిజెపి సాధిస్తోందని, తాజాగా వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచిందంటే ప్రజల మద్దతు ఏ తీరున ఉందో అర్థం అవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతల స్వీకారం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల ఆశలను తెలంగాణ ప్రభుత్వం వంచించిందని ఈ విషయంలో మహిళలంతా సంఘటితం కావాలన్నారు. అన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, అనేక హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రభుత్వం మెడలు వంచే రీతిలో మహిళలు మహోద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీని ఉరి తీయా లంటూ సిపిఐ నారాయణ వ్యాఖ్యానించడం దారుణమని, ఆ పార్టీని ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు ఉరితీశారని అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క పబ్లిక్ టాయిలెట్‌ను కూడా కట్టలేదని ఆకుల విజయ అన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బిజెపి జాతీయ అధ్యక్షుడు పి మురళీధరరావు, పద్మజారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.